ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి: జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు.

మార్చి 9వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని కలెక్టర్ సూచించారు.

ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రజల నుంచి అందిన వినతులను సంబంధిత శాఖాధికారులు వెంటనే స్వీకరించి, వాటిపై త్వరితగతిన చర్యలు తీసుకునేలా చూడాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!