కృష్ణా జిల్లా మచిలీపట్నం: తుఫాన్ ప్రభావం తీవ్రం
కృష్ణ,ఆధాబ్ న్యూస్:
మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద అలలు ఉదృతంగా ఎగసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లో బలమైన గాలులు, వర్షం కొనసాగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం తుఫాన్ మచిలీపట్నానికి సుమారు 280 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారుల యాత్రలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.
తీరప్రాంత ప్రజలు అత్యవసర అవసరాలు తప్ప బయటకు రాకూడదని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను గుర్తించి రిలీఫ్ సెంటర్లకు తరలించే చర్యలు చేపట్టారు.
విపత్తును ఎదుర్కొనేందుకు NDRF బృందాలు తగు ఏర్పాట్లతో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావం మరింత పెరిగే అవకాశంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.









