మణుగూరులో బీసీ 42% రిజర్వేషన్ల కోసం బంద్ పిలుపు
మణుగూరు: ఆధాబ్ న్యూస్ బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్తో రాష్ట్ర బీసీ సంఘాల పిలుపు మేరకు రేపు మణుగూరులో బంద్ నిర్వహించనున్నట్లు బీసీ సంఘాలు ప్రకటించాయి. ఈ బంద్ విజయవంతం చేయాలని బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు పిలుపునిచ్చాయి.
శుక్రవారం సాయంత్రం మణుగూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి బంద్కు మద్దతుగా ప్రజలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మణుగూరు మండల కార్యదర్శులు దుర్గ్యాల సుధాకర్, జక్కుల రాజబాబు, సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. మధుసూదనరెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా బీసీ సంఘాల ఇంచార్జి సోమేశ్వరగౌడ్, బీసీ నాయకులు జి.వి., రుద్ర నాగరాజు, వలసల వెంకటరామారావు, పెనుగొండ సాంబ, పద్మ, రమాదేవి, ఏఐటీయూసీ మణుగూరు మండల అధ్యక్షులు రాయల భిక్షం, సిపిఐ మండల సహాయ కార్యదర్శి వేర్పుల నరేష్, ఎస్కే సర్వర్, అదెర్ల రాములు, కన్నెబోయిన ప్రసాద్, వజ్జా వెంకటేశ్వర్లు, కణితి సత్యనారాయణ వీరబాబు, సతీష్, రంగు ఆంజనేయులు, ఎంఆర్పీఎస్ నాయకులు బోయిళ్ళ వెంకటేశ్వర్లు, ఇసుకల కొండయ్య, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ హక్కుల కోసం అందరూ ఏకమవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు.









