పాల్వంచలో గంజాయి కలకలం — కారులోని ప్యాకెట్లు మంటల్లో కుర్రుకుర్రు
పాల్వంచ, ఆధాబ్ న్యూస్:
స్థానికుల్లో భయభీతిని సృష్టించిన గంజాయి ముఠా పాల్వంచలో గుర్తించబడింది. కారులోని ఇంజిన్లో రవాణా అవుతున్న గంజాయి ప్యాకెట్లు మంటలకు దారితీస్తూ ప్రమాదానికి కారణమయ్యాయి.
కారు ఇంజన్ వేడికి గంజాయి ప్యాకెట్లు మంటలు అంటుకోవడంతో స్థానికులు చింతించారు. కారును స్థానిక వాటర్ సర్వీసింగ్ సెంటర్కు తరలించి మంటలను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించిన సమయంలో, బ్యాగ్ ఓపెన్ చేయడంతో గంజాయి ప్యాకెట్లు కాలిపోయాయి.
స్థానికులు, కంగుతిన్న తర్వాత, పోలీసులకు సమాచారం అందించారు. అయితే, గంజాయి ముఠా సభ్యులు, వీరిలో ఒక మహిళ ఉన్నట్టు గుర్తించిన స్థానికులు, కారును వదిలి పరారయ్యారు.
ప్రస్తుతం పోలీసులు గంజాయి ముఠాను కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ముఠా ముగ్గురు సభ్యులుగా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తింపు జరిగింది.









