ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఇరవండి ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి బాలికపై ప్రధానోపాధ్యాయుడి దాడి!

ఇరవండి ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి బాలికపై ప్రధానోపాధ్యాయుడి దాడి!
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవండి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సంచలన ఘటన చోటుచేసుకుంది. 5వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల సాయి శ్రీ అనే బాలికను స్కూలు ప్రధానోపాధ్యాయుడు విచక్షణరహితంగా కొట్టాడని తల్లిదండ్రులు ఆరోపించారు.

వారి ప్రకారం, చిన్నపాటి తప్పిదానికి కూడా ప్రధానోపాధ్యాయుడు బాలికను తీవ్రంగా కొట్టి, కన్ను, చెవిపక్క రక్తం వచ్చేలా దాడి చేశాడని తెలిపారు. ఈ ఘటనతో బాలిక తీవ్ర భయాందోళనలకు గురైనట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

తల్లిదండ్రులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు. స్థానికులు కూడా ఈ సంఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులపై ఇలాంటి హింసాత్మక ప్రవర్తన ఆందోళన కలిగించేదని పలువురు తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!