ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నల్లగొండలో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య: ఎస్పీ శరత్ చంద్ర పవార్ సీరియస్

నల్లగొండలో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య: ఎస్పీ శరత్ చంద్ర పవార్ సీరియస్

నల్లగొండ,ఆధాబ్ న్యూస్:
నల్లగొండ టూ టౌన్ పరిధిలోని డైట్ స్కూల్ సమీపంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణంపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్పీ పవార్ మంగళవారం ఘటన స్థలాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు పురోగతి, సాక్ష్యాధారాల సేకరణ, నిందితుల వివరాలపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.
నిందితులకు కఠిన శిక్ష తప్పదు ఎస్పీ శరత్ చంద్ర పవార్

ఎస్పీ మాట్లాడుతూ
ప్రధాన నిందితుడు గడ్డం కృష్ణపై రేప్ మరియు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం.
ఇంకా మరెవరు ఘటనలో పాలుపంచుకున్నారా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
అన్ని ఆధారాలు, సాక్ష్యాలు సేకరించి నిందితులకు త్వరగా కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం,” అని తెలిపారు.

 

అలాగే, ఆడపిల్లలపై అఘాయిత్యాలు, హత్యాచారాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని ఎస్పీ పవార్ కఠిన హెచ్చరిక జారీ చేశారు.

ప్రస్తుతం పోలీసులు విచారణను వేగవంతం చేస్తూ, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!