మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వర్షాల అలర్ట్
ఏపీ,/టీజీ: ఆధాబ్ న్యూస్:
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 48 గంటల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ ప్రభావం కారణంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉరుములు, మెరుపులు, గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
🔶 తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు:
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్నగర్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, సంగారెడ్డి, వరంగల్, వికారాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి.
➡️ అధికారులు ప్రజలను బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వర్షాలు ఎక్కువగా కురిసే సమయాల్లో అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు.









