ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  అసలే వర్షాకాలం… ఇక వ్యాధులు తప్పనిసరి!

అసలే వర్షాకాలం… ఇక వ్యాధులు తప్పనిసరి!

డాక్టర్ సాయి మోహన్, మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రి
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
వర్షాకాలం చల్లటి వాతావరణం మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. అయితే వర్షాలతో పాటు కొన్ని ప్రమాదకర వ్యాధులు కూడా వస్తాయి. నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు విపరీతంగా పెరిగి, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతారు.

డెంగ్యూ అంటే ఏమిటి?

డెంగ్యూ అనేది Aedes aegypti అనే దోమ కాటు వల్ల వచ్చే వైరల్ ఫీవర్. ఇది ఒకరి నుండి మరొకరికి నేరుగా వ్యాపించదు. కేవలం దోమ కాటు ద్వారానే వ్యాపిస్తుంది.

డెంగ్యూ ప్రధాన లక్షణాలు

ఉన్నట్టుండి వచ్చే హై ఫీవర్ (2–7 రోజులు)

తలనొప్పి, ముఖ్యంగా కళ్ల వెనుక నొప్పి

కీళ్లు, కండరాల నొప్పులు (Break-bone fever అని కూడా అంటారు)

వాంతులు, తల తిరగడం, డీహైడ్రేషన్

బలహీనత, అలసట, చర్మంపై ఎర్రని దద్దుర్లు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

లక్షణాలు కనిపిస్తే సొంతంగా మందులు వాడకండి; వెంటనే డాక్టర్‌ను సంప్రదించి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి.

ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి (టైర్లు, బకెట్లు, కూలర్లు, కుండీలు).

రాత్రిళ్ళు మోస్కిటో నెట్ వాడటం, రిపెల్లెంట్స్ ఉపయోగించడం.

ఇమ్యూనిటీ పెంచే ఆహారం తీసుకోవాలి – పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ ఉన్న ఆహారం.

మరిగించిన నీళ్లు, కషాయాలు, పండ్ల రసాలు తాగాలి.

పిల్లలు, వృద్ధులు, షుగర్-బీపీ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి.

డెంగ్యూ అపోహలు

డెంగ్యూ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించదు – కేవలం దోమ కాటు ద్వారానే వస్తుంది.

యాంటీబయోటిక్స్‌తో డెంగ్యూ నయం కాదు. సరైన విశ్రాంతి, వైద్య చికిత్సతోనే ఉపశమనం లభిస్తుంది.

🌧️ వర్షాకాలం అందంగా ఉన్నా, జాగ్రత్తలు తప్పనిసరి. లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను కలవడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా మనం డెంగ్యూని అరికట్టవచ్చు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….