ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కూనంనేని సాంబశివరావు అరెస్టును ఖండించిన సీపీఐ

కూనంనేని సాంబశివరావు అరెస్టును ఖండించిన సీపీఐ

పినపాక, జూన్ 27 (ఆధాబ్ న్యూస్): హనుమకొండ జిల్లా కేంద్రంలోని అదాలత్ సెంటర్‌లో పేదల పక్షాన పోరాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ పినపాక మండల కార్యదర్శి తోగటి కుమార్ తీవ్రంగా ఖండించారు.

ఈ మేరకు శుక్రవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న గుడిసెలను అధికారులు బలవంతంగా తొలగించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. నిలువ నీడలేని పేదలు వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా, వారికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

అక్రమ అరెస్టులతో పేదల భూపోరాటాలను, ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని హెచ్చరించిన ఆయన, ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలకు న్యాయం చేయాలని, అరెస్టు చేసిన వామపక్ష నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్