ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరు ఉడతానేని గుంపులో ప్రభుత్వ భూమిపై తహసిల్దార్ హెచ్చరిక.                     

మణుగూరు ఉడతానేని గుంపులో ప్రభుత్వ భూమిపై తహసిల్దార్ హెచ్చరిక.                      మణుగూరు,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఉడతానేని గుంపులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం కేటాయించిన 28 ఎకరాల భూమిపై ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేయాలని, ఆక్రమించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ నరేష్ హెచ్చరించారు.

ఈ స్థలం ప్రభుత్వ ఆస్తి కావడంతో ఎలాంటి వ్యక్తిగత హక్కులు లేవని స్పష్టం చేశారు. భూమి మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందని, ఎవరైనా ఆక్రమించడానికి ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ స్పష్టంచేశారు.

ప్రజలకు హెచ్చరికగా అక్కడే ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!