గిరిజన చిన్నారుల చదువుకు వనవాసి కళ్యాణ పరిషత్ చేయూత
భద్రాచలం, ఆధాబ్ న్యూస్:
వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా భద్రాచలంలోని శిశు మందిర్లో చదువుతున్న గిరిజన చిన్నారులు సోయం భవ్య శ్రీ, భాను శ్రీలకు చదువుకోసం ఆర్థిక సహాయం అందించారు.
చర్ల మండలం, చెలిమెల గ్రామానికి చెందిన ఈ చిన్నారులు తండ్రిని కోల్పోయి, తల్లి మరియు సోదరులతో కష్టాల్లో జీవిస్తున్నారు. ఈ విషయం వనవాసి కళ్యాణ పరిషత్ జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ సూచనపై, హైదరాబాద్కు చెందిన పెద్దాడ హితనంద్ ద్వారా తుమ్మలపల్లి స్ఫూర్తి ముందుకు వచ్చి, ఒక సంవత్సరం చదువుకోసం రూ. 17,000 సహాయం అందించారు.
ప్రధాన ఆచార్య గీత మాత ఆ చిన్నారుల తరపున ఆర్థిక సహాయం స్వీకరించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి స్ఫూర్తి చిన్న వయసులోనే ఇలాంటి మంచి ఆలోచనతో ముందుకు రావడం గొప్ప విషయం అని అభినందించారు.
ఈ కార్యక్రమంలో వనవాసి కళ్యాణ పరిషత్ ప్రాంత సహా మహిళా ప్రముఖు పెద్దాడ ఆశాలత, సరస్వతీ శిశు మందిర్ ప్రధాన ఉపాధ్యాయురాలు గీత, సూర్యనారాయణ, సింధు మాతాజీ, దుర్గ భవాని, సత్యనారాయణ, కడాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.









