ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గిరిజన చిన్నారుల చదువుకు వనవాసి కళ్యాణ పరిషత్ చేయూత

గిరిజన చిన్నారుల చదువుకు వనవాసి కళ్యాణ పరిషత్ చేయూత

భద్రాచలం, ఆధాబ్ న్యూస్:
వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా భద్రాచలంలోని శిశు మందిర్‌లో చదువుతున్న గిరిజన చిన్నారులు సోయం భవ్య శ్రీ, భాను శ్రీలకు చదువుకోసం ఆర్థిక సహాయం అందించారు.

చర్ల మండలం, చెలిమెల గ్రామానికి చెందిన ఈ చిన్నారులు తండ్రిని కోల్పోయి, తల్లి మరియు సోదరులతో కష్టాల్లో జీవిస్తున్నారు. ఈ విషయం వనవాసి కళ్యాణ పరిషత్ జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ సూచనపై, హైదరాబాద్‌కు చెందిన పెద్దాడ హితనంద్ ద్వారా తుమ్మలపల్లి స్ఫూర్తి ముందుకు వచ్చి, ఒక సంవత్సరం చదువుకోసం రూ. 17,000 సహాయం అందించారు.

ప్రధాన ఆచార్య గీత మాత ఆ చిన్నారుల తరపున ఆర్థిక సహాయం స్వీకరించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి స్ఫూర్తి చిన్న వయసులోనే ఇలాంటి మంచి ఆలోచనతో ముందుకు రావడం గొప్ప విషయం అని అభినందించారు.

ఈ కార్యక్రమంలో వనవాసి కళ్యాణ పరిషత్ ప్రాంత సహా మహిళా ప్రముఖు పెద్దాడ ఆశాలత, సరస్వతీ శిశు మందిర్ ప్రధాన ఉపాధ్యాయురాలు గీత, సూర్యనారాయణ, సింధు మాతాజీ, దుర్గ భవాని, సత్యనారాయణ, కడాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!