ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ సమావేశం ఉత్సాహవంతంగా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ సమావేశం ఉత్సాహవంతంగా

కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్‌లో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సమావేశం జరిగింది. జిల్లాలోని అన్ని మండలాల నుండి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేదికను కిక్కిరిసేలా చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ విభాగం జాతీయ కార్యనిర్వాహకులు మరియు తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ గంటా వినయ్ హాజరై, పార్టీ బలోపేతానికి నూతన వ్యూహరచన, గ్రామ స్థాయిలో బూత్ కమిటీల బలోపేతం, యువతకు అధిక ప్రాధాన్యం వంటి అంశాలపై సూచనలు అందించారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదెం వీరయ్య మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో రాబోయే పార్టీ కార్యక్రమాల రూపురేఖలు, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే చర్యలు, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడం వంటి అంశాలపై చర్చ జరిగింది. మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!