ప్రతి క్షణం
ప్రజల పక్షం

  శ్రీశైలం – భద్రాచలం – మణుగూరు బస్ సర్వీస్ ప్రారంభం

శ్రీశైలం – భద్రాచలం – మణుగూరు బస్ సర్వీస్ ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
శ్రీశైలం నుండి భద్రాచలం – మణుగూరు మార్గంలో ప్రతిరోజూ సర్వీస్ నెంబర్ 64347 కింద బస్సు నడుస్తోంది. సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం నుండి బయలుదేరే ఈ బస్సు, దోర్నాల మీదుగా రాత్రి 7:45 గంటలకు వినుకొండకు, 8:30 గంటలకు నర్సరావుపేటకు చేరుకుంటుంది. అనంతరం గుంటూరు, విజయవాడ, తిరువూరు, కొత్తగూడెం మార్గంగా ప్రయాణించి, తెల్లవారుజామున 2:40 గంటలకు భద్రాచలానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి 3:50 గంటలకు మణుగూరు వైపు బయలుదేరుతుంది.

ప్రయాణ ఛార్జీలు:

శ్రీశైలం → నర్సరావుపేట : ₹400

శ్రీశైలం → వినుకొండ : ₹340

నర్సరావుపేట → భద్రాచలం : ₹470

వినుకొండ → భద్రాచలం : ₹540

ఈ సర్వీస్ ద్వారా శ్రీశైలం, వినుకొండ, నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ, తిరువూరు, కొత్తగూడెం ప్రాంతాల ప్రయాణికులకు భద్రాచలం, మణుగూరు చేరుకోవడం సులభతరం కానుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!