తాటిగూడెంలో ఆత్మీయంగా రాఖీ పండుగ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:

కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామంలో శనివారం రాఖీ పౌర్ణమి పండుగను సోదరులు–సోదరీమణులు ఆత్మీయంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం అలముకుంది. సోదరీమణులు సోదరుల చేతికి రాఖీలు కట్టి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కోరగా, సోదరులు జీవితాంతం రక్షణ వాగ్దానం చేశారు.
గ్రామంలోని పలు కుటుంబాలు రాఖీ పండుగను సంప్రదాయ బద్ధంగా నిర్వహించగా, పిల్లలు, పెద్దలు ఆనందంగా పాల్గొన్నారు. కొందరు సోదరులు దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా గ్రామానికి చేరుకుని రాఖీ వేడుకల్లో పాల్గొనడం విశేషంగా మారింది. పండుగ సందర్భంగా గ్రామంలో ఐక్యత, ఆప్యాయత వాతావరణం నెలకొంది.
Post Views: 63









