భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి నూతన ఈవో కే.దామోదర్ రావు
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి నూతన ఈవో భద్రాచలం ఆర్డీవో కే.దామోదర్ రావు నియమితుడయ్యాడు.
సోమవారం నాడు ఆయన దేవస్థానం ఈవో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా తాత్కాలిక అధికారుల ద్వారా దేవస్థానం పరిపాలన సాగుతున్న విషయం తెలిసిందే.
ప్రముఖ దేవాలయ పరిపాలనకు బాధ్యతలు తీసుకున్న దామోదర్ రావు ఆలయ అభివృద్ధికి చొరవ చూపనున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. భక్తులకు మెరుగైన సేవలు, ఏర్పాట్లపై దృష్టిసారించనున్నాడు.
Post Views: 59









