మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో కలవల నాగారంలో వాహనాల తనిఖీలు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా కరకగూడెం మండలం కలవల నాగారం గ్రామంలో మంగళవారం కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి, వారి వద్ద ఉన్న లగేజీ బ్యాగులు, వాహనాలు, గుర్తింపు కార్డులను అధికారులు సవివరంగా పరిశీలించారు. అనుమానం కలిగే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ కార్యక్రమంలో టీజీఎస్పీ (TGSP) స్పెషల్ పార్టీ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Post Views: 131









