ప్రతి క్షణం
ప్రజల పక్షం

  🌧️ నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

🌧️ నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్రం వర్షాల ముప్పు ముందస్తు హెచ్చరికలతో తిరిగి జలకళకోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే రెండు మూడు రోజులుగా వర్షాలు దంచికొడుతుండగా, హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి మొదలైన వర్షం బుధవారం ఉదయం వరకు కొనసాగుతోంది.

వాతావరణ శాఖ తాజా వివరాల ప్రకారం, బుధ, గురువారాల్లో హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే సూచనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రాబోయే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వర్షపాతం అధికంగా ఉండే అవకాశముందని అంచనా. ఇందుకోసం కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్నికీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
అధిక వర్షాలు కురిసే జిల్లాలు:
అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం.

ఈ జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రజలకు సూచనలు:

అత్యవసరం అయితేనే బయటకు రావాలి

చెట్ల కింద ఆశ్రయం తీసుకోవద్దు

రైతులు సాయంత్రం వేళ పొలాలకు వెళ్లవద్దు

నీటి ప్రవాహ ప్రాంతాలకు దూరంగా ఉండాలి

వాతావరణ పరిస్థితులపై అధికారిక సమాచారం కోసం ప్రజలు అధికారిక వాతావరణ శాఖ మార్గదర్శకాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!