మెగా ఆధార్ క్యాంపులకు అపూర్వ స్పందన
జిల్లా ప్రజలకు సేవలందిస్తున్నందుకు ఆనందంగా ఉంది – కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూలై 9 నుండి 17 వరకు నిర్వహించిన మెగా ఆధార్ క్యాంపులు ప్రజల నుండి విశేష స్పందన అందుకున్నాయి. ఈ క్యాంపుల ద్వారా మొత్తం 6,159 మంది ఆధార్ నమోదు, సవరణలు వంటి సేవలు పొందినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
కలెక్టరేట్ క్యాంప్లో 3,772 మంది
భద్రాచలం – 801
ఇల్లందు – 714
మణుగూరు – 525
దమ్మపేట – 347
ఈ ఆధార్ క్యాంపుల్లో మొత్తం 3,500 ఫిర్యాదులు స్వీకరించబడి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ వెల్లడించారు.
ఆధార్ సేవలు అందుబాటులో ఉన్న మండలాలు:
దుమ్ముగూడెం, చర్ల, గుండాల, దమ్మపేట, మణుగూరు, భద్రాచలం, ఇల్లందు, టేకులపల్లి, ముల్కలపల్లి, అన్నపూరెడ్డిపల్లి, అశ్వాపురం, పినపాక, కరకగూడెం, కొత్తగూడెం, పాల్వంచ, సుజాత్నగర్, చండ్రుగొండ, జూలూరుపాడు, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఈ సేవలు పంచాయతీ కార్యాలయాలు, MPDO కార్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, స్కూల్ ఆధార్ టీంల ద్వారా అందుబాటులో ఉన్నాయి. కొన్ని మండలాల్లో త్వరలోనే ఆధార్ సేవలు ప్రారంభం కానున్నాయి.
అవసరమైన సమాచారం కోసం:
స్కూల్ ఆధార్ టీమ్ వివరాలకు:
జిల్లా మేనేజర్ వంశీ – 7331115024
ఫిర్యాదులు లేదా సలహాల కోసం:
UIDAI హెల్ప్లైన్: 1947 ఇ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు – కలెక్టరేట్లో అందుబాటులో ఉంటారు.
కలెక్టర్ సూచన:
“మీ ఆధార్ – మీ హక్కు. అవసరమైన అప్డేట్లు తప్పక చేయించుకోండి. ప్రజల భాగస్వామ్యంతో సేవలను మరింత విస్తృతంగా అందించగలుగుతున్నాం.









