ప్రతి క్షణం
ప్రజల పక్షం

  దివ్యాంగుల కోసం స్వయం ఉపాధి ఋణాల పథకం: జూలై 31 వరకు దరఖాస్తులు

దివ్యాంగుల కోసం స్వయం ఉపాధి ఋణాల పథకం: జూలై 31 వరకు దరఖాస్తులు

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 14 (ఆధాబ్ న్యూస్):
దివ్యాంగుల ఆర్థిక పునరావాస పథకం (E.R.S.) క్రింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రాయితీ లభించే యూనిట్లను మంజూరు చేసింది. ఈ మేరకు అర్హులైన దివ్యాంగులు జూలై 14 నుండి 31వ తేదీ వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి స్వర్ణలత లేనినా వెల్లడించారు.

మంజూరు చేసిన యూనిట్లు వివరాలు:

100% రాయితీతో ₹50,000 విలువ గల 27 యూనిట్లు

80% రాయితీతో ₹1,00,000 విలువ గల 1 యూనిట్

60% రాయితీతో ₹3,00,000 విలువ గల 1 యూనిట్

దరఖాస్తు చేసుకోవాలనుకున్న దివ్యాంగులు https://tgobmms.cgg.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయవచ్చు. మరిన్ని వివరాలకు 6301981960, 8331006010 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్