మాతృవియోగంలో ఉన్న రేగా కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కరకగూడం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాతృవియోగాన్ని చెందగా, ఆయన స్వగ్రామమైన కరకగూడెం గ్రామంలో పరామర్శించిన తెలంగాణ జాగృతి గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
ఈ సందర్భంగా రేగా కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులను ఆదరిస్తూ ధైర్యం చెబుతూ, పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
పరామర్శ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 36









