జూలై 7న కొత్తగూడెం కలెక్టరేట్లో ప్రజావాణి
సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశం
భద్రాద్రికొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: జూలై 7వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించారు.
ప్రతి శాఖకు చెందిన జిల్లా అధికారులు తప్పకుండా సమయానికి హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకునే విధంగా స్పందించాలని తెలిపారు.
స్థలం: కలెక్టరేట్ సమావేశ మందిరం, భద్రాద్రి కొత్తగూడెం
సమయం: ఉదయం 10:30 గంటల నుండి
“ప్రజల సమస్యలు నేరుగా విన్న పిమ్మట వాటి పరిష్కారానికి చర్యలు చేపడతాం” అని కలెక్టర్ అన్నారు.
Post Views: 34









