బెట్టింగ్ ఆడొద్దని మందలించినందుకు తండ్రిని హత్య చేసిన కుమారుడు
వనపర్తి, ఆధాబ్ న్యూస్:
బెట్టింగ్కు బానిసైన యువకుడు ఓ నిష్ఠూర హంతకుడిగా మారాడు. తన తప్పులను సూచిస్తూ మందలించిన తండ్రిని కత్తితో గొంతు కోసి హత్య చేసిన దారుణ సంఘటన వనపర్తి జిల్లా ఘన్పూర్ మండలం కోతులకుంట తండాకు చెందిన ఓ కుటుంబంలో వెలుగుచూసింది.
కేతావత్ హనుమంతు (37), భార్యతో పాటు ఇద్దరు కొడుకులు రవీందర్ (19), సంతోష్లతో కలిసి జీవనోపాధి కోసం గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్కు వలస వచ్చాడు. మేస్త్రీగా పని చేస్తున్న హనుమంతు కుమారుడు రవీందర్ ఇంటర్ పూర్తిచేసి, నిరుద్యోగంగా కాలం వెచ్చిస్తూ జూలాయిలా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతడు బెట్టింగ్కు బానిసై డబ్బులు పోగొట్టుకున్నాడు.
ఇటీవల హనుమంతు తన కొడుకుల చదువు కోసం సొంతూరు భూమిని తాకట్టు పెట్టి రూ.6 లక్షలు తీసుకొచ్చాడు. అందులో రూ.2.5 లక్షలు రవీందర్ తన అకౌంట్లో వేసుకుంటూ బ్యాంకులో భద్రంగా ఉంటుందని చెప్పాడు. అయితే, ఆ మొత్తం డబ్బునే బెట్టింగ్ యాప్లో పెట్టి కోల్పోయాడు. తండ్రి ఆ డబ్బుల గురించి అడగగా, స్నేహితుడికి ఇచ్చానని, త్వరలోనే తీసుకొస్తాడని తప్పుడు మాటలు చెప్పాడు.
తరచూ డబ్బుల విషయానికీ, బెట్టింగ్ అలవాటు విషయంలో తండ్రి హనుమంతుతో గొడవలు జరిగిన రవీందర్, చివరకు అతనిపై కక్ష పెంచుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం డబ్బు తిరిగి తీసుకెళతానంటూ తండ్రిని ఎన్టీఆర్ నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తండ్రికి తన స్నేహితుడు డబ్బులతో పాటు సర్ప్రైజ్ ఇస్తాడని చెప్పి కళ్లకు గంతలు కట్టాడు. అనంతరం తనతో తీసుకొచ్చిన కత్తితో హనుమంతు గొంతును కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో హనుమంతు అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, పరారీలో ఉన్న రవీందర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ల్
ఘటన ద్వారా సందేశం:
ఈ సంఘటన యువతను పొగిడేస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ మత్తు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం మొత్తం కలసి యువతలో నైతిక విలువలు బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.









