గిరిజన ప్రాంతాల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి – ఐటిడిఏ పీవో ఆదేశాలు
మణుగూరు, జూలై 4: ఆధాబ్ న్యూస్:
ఐటిడిఏ పీవో ఆదేశాల మేరకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు జిల్లా అదనపు వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు.
గిరిజనుల ప్రయోజనార్థం ఈ మార్గదర్శకాలు రూపొందించినట్టు వారు వెల్లడించారు. ప్రతి ఆసుపత్రి గిరిజనులకు అందుబాటు ధరలకే వైద్య సేవలు అందించాలి. ఆసుపత్రుల ప్రాంగణంలో ప్రాక్టీ ఆఫీసర్ జారీ చేసిన దరల పట్టికను అందరికీ కనబడే విధంగా స్పష్టంగా ప్రదర్శించాలి.
అలానే, రక్తపరీక్ష కేంద్రాలు, ప్రయివేట్ ఆసుపత్రులు సర్క్యూలర్లో పేర్కొన్న నియమాలను తప్పనిసరిగా పాటించాలి. వాస్తవానికి భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఆదేశాల అమలును పర్యవేక్షించేందుకు ఐటిడిఏ కార్యాలయం లింగ్యా నాయక్, ఆరోగ్య విస్తరణ అధికారి గొంది వెంకటేశ్వర్లు సమన్వయంతో పని చేస్తున్నారు.
ప్రజలు ఏవైనా అక్రమాలు గమనిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని వారు సూచించారు. గిరిజనుల ఆరోగ్యాన్ని పరిరక్షించే దిశగా ఇది కీలక చర్యగా అధికారులు పేర్కొన్నరు.









