ఇల్లందు SHO సస్పెండ్ – ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కఠిన చర్య
ఇల్లందు, ఆధాబ్ న్యూస్:
భార్యభర్తల మధ్య వ్యక్తిగత వివాదం కేసులో బాధితుడి తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనపై మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి (IPS) కఠినంగా స్పందించారు. ఈ సంఘటనపై విచారణ అనంతరం, ఇల్లందు SHO సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక పోలీసు అధికారిగా ప్రవర్తించవలసిన నీతి, న్యాయం లను అతిక్రమించి బాధిత కుటుంబ హక్కులను ఉల్లంఘించినందుకుగాను ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి IPS పేర్కొంటూ,
ఎటువంటి పోలీసు అధికారి అయినా స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో అమర్యాదగా ప్రవర్తిస్తే శాఖాపరంగా కఠిన చర్యలు తప్పవు. పోలీసులు ప్రజలకు రక్షణగా నిలవాలి కాని భయంకరంగా కాకూడదు” అని హెచ్చరించారు.
ఈ చర్యతో పోలీస్ శాఖలో క్రమశిక్షణకు ప్రాధాన్యం పెరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.









