ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జిల్లా ఎస్పీ ఆదేశాలపై వలస ఆదివాసి గ్రామాల సందర్శన

జిల్లా ఎస్పీ ఆదేశాలపై వలస ఆదివాసి గ్రామాల సందర్శన

భద్రాద్రి కొత్తగూడెం , ఆధాబ్ న్యూస్: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు టేకులపల్లి సీఐ టీ. సురేష్, ఎస్‌ఐ సోమేశ్వర్ కలిసి ఆళ్లపల్లి మండలంలో వలస ఆదివాసి గ్రామాలైన సింగారం మరియు వెంకటాపురంను సందర్శించారు.

ఈ సందర్భంగా వారు స్థానిక ఆదివాసీ ప్రజలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. పోలీస్ అధికారుల ఈ విజిట్‌ ద్వారా ప్రజలకు భద్రతా విషయాల్లో నమ్మకం కలగాలని, ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉన్న పథకాల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

గ్రామాల్లో నేరాల నివారణ, యువతలో చైతన్యం, విద్యపై ఆసక్తి పెంపొందించేందుకు అధికారులు చర్చలు జరిపారు. ఆదివాసీ ప్రజలు పోలీస్ అధికారుల పర్యటనకు సంతోషం వ్యక్తం చేశారు.

ఇటువంటి పర్యటనలు తరచుగా నిర్వహించి ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!