టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములును సన్మానించిన టెలికాం బోర్డు సభ్యులు బోదాసు కనకరాజు
ఖమ్మం,ఆధాబ్ న్యూస్:
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగా సీతారాములు ను టెలికాం బోర్డు సభ్యులు బోదాసు కనకరాజు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా బోదాసు కనకరాజు పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలుపుతూ, శాలువా కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బోదాసు కనకరాజు, “నిత్యం ప్రజల సమస్యలకు స్పందిస్తూ, కార్యకర్తలకు అండగా నిలుస్తూ, పార్టీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న నాగా సీతారాములను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడం హర్షణీయం,” అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆకిరెడ్డి వెంకటేశ్వర్లు, కున్సోత్ కిషన్, అజ్మీర్ మంగీలాల్, యువజన కాంగ్రెస్ నాయకులు మాళోత్ శివ, ఐఎన్టీయూసీకి చెందిన శివ తదితరులు పాల్గొన్నారు.









