హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి ఖమ్మం జిల్లా బాధ్యతలు
హైదరాబాద్/ఖమ్మం ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్రంలో అధికారుల బదిలీల తాకిడి కొనసాగుతుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12న భారీ స్థాయిలో 36 మంది ఐఏఎస్ మరియు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో కీలకంగా నిలిచింది – హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న దురిశెట్టి అనుదీప్ను ఖమ్మం జిల్లా కలెక్టర్గా బదిలీ చేయడం.
2018 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అనుదీప్ దురిశెట్టి, ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లా పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధానంతో, ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల అభివృద్ధిలో పలు వినూత్న కార్యక్రమాలను అమలు చేశారు. తాజాగా ఖమ్మం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన, అక్కడ కూడా ప్రజా సమస్యలపై కేంద్రంగా పనిచేయాలని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఖమ్మం అభివృద్ధికి నూతన ఊపు ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం కావాల్సిన నేపథ్యంలో అనుదీప్ బదిలీకి ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తోంది. అభివృద్ధి దిశగా పారదర్శక పాలన, ప్రజలతో నేరుగా వ్యవహరించే తత్వం ఉన్న అనుదీప్ సేవలు ఖమ్మం జిల్లా అభివృద్ధికి దోహదపడతాయని స్థానిక విశ్లేషకులు భావిస్తున్నారు.
బదిలీల్లో మరిన్ని కీలక నియామకాలు ఈసారి బదిలీల్లో అనేక జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆదేశాలతో పరిపాలనను మరింత చురుకుగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. నియమితులైన అధికారులు తక్షణమే బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.









