కరకగూడెం రాళ్లవాగు వద్ద ద్విచక్ర వాహనాలు ఢీ: ఇద్దరూ గాయాలతో ఆసుపత్రికి తరలింపు.
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని రాళ్లవాగు వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఎదురెదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదంలో పద్మాపురం గ్రామానికి చెందిన గొగ్గలి రాజు, పినపాక మండలంలోని మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు అని సమాచారం? ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చి, గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారి పరిస్థితిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
Post Views: 95









