వేపలగడ్డలో రాష్ట్ర స్థాయి బ్యాట్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు ఘన ప్రారంభం
వేపలగడ్డ,ఆధాబ్,న్యూస్: వేపలగడ్డలోని వివిన్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి బ్యాట్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు ఘనంగా ప్రారంభం జరిగింది. టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడలవైపు ఆకర్షితులై ఆరోగ్యాన్ని, ప్రతిభను పెంపొందించుకోవాలన్నారు.
ఈ పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా ఐటీడీఏ పీఓ రాహుల్ పాల్గొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు విద్యతోపాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని తెలిపారు. క్రీడాకారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు.
ఈ కార్యక్రమంలో ఛాంపియన్షిప్ ప్రెసిడెంట్ రవి కుమార్, జనరల్ సెక్రటరీ డాక్టర్ సావిత్రి, ట్రెజరర్ కె. రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి క్రీడాకారులు హాజరై పోటీల్లో తమ ప్రతిభను చాటుతున్నారు.
పోటీలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.









