భద్రాచలం పర్యటనలో హైకోర్టు జడ్జి భీమపాక నాగేష్కు కలెక్టర్ సన్మానం
భద్రాచలం,ఆధాబ్ న్యూస్: భద్రాచలం పర్యటనలో భాగంగా తెలంగాణ హైకోర్టు జడ్జి భీమపాక నాగేష్ శుక్రవారం సారపాక ఐటిసి గెస్ట్ హౌస్ను సందర్శించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను బహూకరిస్తూ స్వాగతం పలికాడు.
జడ్జిని కలెక్టర్ సాదరంగా ఆహ్వానించగా, జిల్లా పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు హాజరయ్యారు.
Post Views: 48









