ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో నూతన తాసిల్దార్ వట్టం కాంతయ్యకు టిడిపి నాయకులు ఘన సన్మానం

కరకగూడెంలో నూతన తాసిల్దార్ వట్టం కాంతయ్యకు టిడిపి నాయకులు ఘన సన్మానం

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: ఇంచార్జ్ తాసిల్దారుగా పదవి బాధ్యతలు స్వీకరించిన వట్టం కాంతయ్య కరకగూడెం తేలుగుదేశం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ  కార్యక్రమంలో టిడిపి నాయకులు, కమలాకర్, పాయం లక్ష్మీనారాయణ మరియు కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తాసిల్దార్ వట్టం కాంతయ్య మాట్లాడుతూ, “ప్రజల సమస్యలకు త్వరిత పరిష్కారం కల్పిస్తూ పారదర్శకంగా పరిపాలనను కొనసాగిస్తాను,” అని హామీ ఇచ్చారు. ప్రజలకు న్యాయం చేయడం తన ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!