ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పోలీస్ సేవ పతకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

పోలీస్ సేవ పతకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బందికి సేవా పతకాలను ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈసారి మొత్తం 625 మందికి వివిధ రకాల సేవా పతకాలు లభించాయి. వాటిలో:

శౌర్య పతకం: గ్రేహౌండ్స్‌కు చెందిన 9 మంది

మహోన్నత సేవా పతకం: 16 మంది

ఉత్తమ సేవా పతకం: 92 మంది

కఠిన సేవా పతకం: 47 మంది

సేవా పతకం: 461 మంది

ఇతర విభాగాల వారికీ ఈ విధంగా పతకాలు లభించాయి:

అవినీతి నిరోధక శాఖ:

మహోన్నత సేవా – 1

ఉత్తమ సేవా – 4

సేవా పతకం – 17

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ:

ఉత్తమ సేవా – 1

సేవా పతకం – 5

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF):

మహోన్నత సేవా – 1

ఉత్తమ సేవా – 3

సేవా పతకం – 15

డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీస్ శాఖ:

శౌర్య పతకం – 2

మహోన్నత సేవా – 1

ఉత్తమ సేవా – 3

సేవా పతకం – 14

 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం విధుల్లో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం సేవా పతకాలు ప్రదానం చేస్తూ వస్తోంది. ఈ పరంపరలో భాగంగా ఈ ఏడాది కూడా పతకాలు ప్రకటించడం జరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!