ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పోలీస్ సేవ పతకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

పోలీస్ సేవ పతకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బందికి సేవా పతకాలను ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈసారి మొత్తం 625 మందికి వివిధ రకాల సేవా పతకాలు లభించాయి. వాటిలో:

శౌర్య పతకం: గ్రేహౌండ్స్‌కు చెందిన 9 మంది

మహోన్నత సేవా పతకం: 16 మంది

ఉత్తమ సేవా పతకం: 92 మంది

కఠిన సేవా పతకం: 47 మంది

సేవా పతకం: 461 మంది

ఇతర విభాగాల వారికీ ఈ విధంగా పతకాలు లభించాయి:

అవినీతి నిరోధక శాఖ:

మహోన్నత సేవా – 1

ఉత్తమ సేవా – 4

సేవా పతకం – 17

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ:

ఉత్తమ సేవా – 1

సేవా పతకం – 5

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF):

మహోన్నత సేవా – 1

ఉత్తమ సేవా – 3

సేవా పతకం – 15

డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీస్ శాఖ:

శౌర్య పతకం – 2

మహోన్నత సేవా – 1

ఉత్తమ సేవా – 3

సేవా పతకం – 14

 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం విధుల్లో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం సేవా పతకాలు ప్రదానం చేస్తూ వస్తోంది. ఈ పరంపరలో భాగంగా ఈ ఏడాది కూడా పతకాలు ప్రకటించడం జరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్