పోలీస్ సేవ పతకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బందికి సేవా పతకాలను ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈసారి మొత్తం 625 మందికి వివిధ రకాల సేవా పతకాలు లభించాయి. వాటిలో:
శౌర్య పతకం: గ్రేహౌండ్స్కు చెందిన 9 మంది
మహోన్నత సేవా పతకం: 16 మంది
ఉత్తమ సేవా పతకం: 92 మంది
కఠిన సేవా పతకం: 47 మంది
సేవా పతకం: 461 మంది
ఇతర విభాగాల వారికీ ఈ విధంగా పతకాలు లభించాయి:
అవినీతి నిరోధక శాఖ:
మహోన్నత సేవా – 1
ఉత్తమ సేవా – 4
సేవా పతకం – 17
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ:
ఉత్తమ సేవా – 1
సేవా పతకం – 5
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF):
మహోన్నత సేవా – 1
ఉత్తమ సేవా – 3
సేవా పతకం – 15
డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీస్ శాఖ:
శౌర్య పతకం – 2
మహోన్నత సేవా – 1
ఉత్తమ సేవా – 3
సేవా పతకం – 14
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం విధుల్లో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం సేవా పతకాలు ప్రదానం చేస్తూ వస్తోంది. ఈ పరంపరలో భాగంగా ఈ ఏడాది కూడా పతకాలు ప్రకటించడం జరిగింది.









