తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరకగూడెం మండలంలో జెండా ఆవిష్కరణ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో రేపు (2.5.2025) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది అని బిఆర్ఎస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షుడు రావుల సోమయ్య అన్నారు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ శాసనసభ్యుల రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది.
ఉదయం 8 గంటలకు కరకగూడెం మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అనంతరం జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతుంది.
ఈ కార్యక్రమంలో మండలంలోని మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, యువజన నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నారు.









