ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వరద కల్లోలం: ఈశాన్య రాష్ట్రాలు తడిసి ముద్దై విలవిల

వరద కల్లోలం: ఈశాన్య రాష్ట్రాలు తడిసి ముద్దై విలవిల. ఆధాబ్ న్యూస్,న్యూ ఢిల్లీ:
ఈశాన్య భారతం వరదలు, భారీ వర్షాలు, కొండచరియల భీభత్సంతో విలవిల్లాడుతోంది. గడిచిన రెండు రోజుల్లో 30 మంది మృత్యువాత పడ్డారు. సోమవారం ఒక్కరోజే 14 మంది మృతి చెందారు. అస్సాంలో 12 జిల్లాల్లో దాదాపు 60 వేల మంది ప్రజలు వరదలతో ప్రభావితులయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపుర్, మిజోరంలలో వేలాది మంది తమ నివాసాలను వదిలి ఆశ్రయ కేంద్రాల్లోకి చేరాల్సి వచ్చింది.

గువాహటిలో ఒక్కరోజే 111 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గత 67 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం అని వెల్లడించారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!