మణుగూరు కొత్త సీఐ పి. నాగబాబును బీసీ సంఘం నాయకుల సన్మానం
మణుగూరు ఆధాబ్ న్యూస్:
మణుగూరులో పదవీ బాధ్యతలు స్వీకరించిన నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. నాగబాబు బీసీ సంక్షేమ సంఘం నాయకులు శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా, తెలంగాణ స్టేట్ BC సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి & ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ బుర్ర సోమేశ్ గౌడ్, మణుగూరు మండల అధ్యక్షులు వీరంకి వెంకట్రావు, మండల ప్రధాన కార్యదర్శి పెనుగొండ సాంబశివరావు, మండల గౌరవ సలహాదారులు జీవి వెంకటేశ్వర్లు, మండల గౌరవ అధ్యక్షులు ఎ.యం. చారి, నాయకులు గుర్రం శ్రీనివాస్, మహిళా నాయకురాలు తోట మంగ గారు పాల్గొన్నారు.
బీసీ సంఘం ప్రతినిధులు సీఐ మర్యాదపూర్వకంగా కలిసి పువ్వుల గుచ్ఛాలు ఇచ్చి, శాలువాతో సన్మానించారు. మణుగూరులో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆయన సేవలు కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Post Views: 29









