జూలూరుపాడు మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన
ఇంకుడు గుంతలు, ఫారం ఫండ్ నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం , ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జూలూరుపాడు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం విస్తృత పర్యటన నిర్వహించాడు. పర్యటనలో భాగంగా ఇంకుడు గుంతలు, ఫారం ఫండ్ నిర్మాణాలు, అలాగే మునగ తోటలను తనిఖీ చేశాడు.
గ్రామస్థులతో మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించాడు. ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల భూముల్లో తేమ నిల్వ కావడంలో ఉపయోగపడుతుందని వివరించాడు. ఫారం ఫండ్ పనుల నాణ్యతను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశాడు.
మునగ తోటల్లో పంటల అభివృద్ధిని దగ్గరగా పరిశీలించి, నిర్వహణ పద్ధతులను ప్రశంసించాడు. రైతులు కొత్త పంటల దిశగా ప్రయోగాలు చేయాలని ప్రోత్సహించాడు.
ఈ సందర్భంగా పలువురు స్థానిక రైతులు, గ్రామస్తులు కలిసి తమ సమస్యలను వినిపించారు. వాటిని శ్రద్ధగా విని, త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చాడు.
పర్యటనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, మండల అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.









