ఆపరేషన్ సిందూర్ లో భారీ నష్టం.. పాక్ అంగీకారం
11 మంది సైనికులు మృతి.. 78 మందికి తీవ్రగాయాలు.
ఆధాబ్ న్యూస్: డిస్క్
ఇటీవల భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్కు తీవ్ర నష్టం కలిగించినట్లు ఆ దేశ అధికారిక వర్గాలు తొలిసారి అంగీకరించాయి. ఈ ఆపరేషన్లో మొత్తం 11 మంది సైనికులు మృతి చెందారని, 78 మంది గాయపడ్డారని పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (DG ISPR) అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
మృతుల్లో ఐదుగురు పాక్ వాయుసేన సిబ్బంది, ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు ప్రకటించింది. ఈ ఘటనలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ కూడా మృతిచెందినట్టు సమాచారం.
ఇటీవల జరిగిన దాడుల్లో 40 మంది పౌరులు మరణించగా, 121 మంది గాయపడినట్లు DG ISPR ప్రకటనలో పేర్కొంది. పౌరుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్టు వెల్లడించారు.
ఈ మేరకు పాక్ ప్రభుత్వం అత్యవసరంగా భద్రతా సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. భారత వైపు నుండి ఈ ఆపరేషన్పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.









