ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  రాజీవ్ యువ వికాసానికి సీబిల్ స్కోర్ అవసరం లేదు – అపోహలకు తావులేదని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాజీవ్ యువ వికాసానికి సీబిల్ స్కోర్ అవసరం లేదు – అపోహలకు తావులేదని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులో మంగళవారం నూతనంగా నిర్మించనున్న 33/11 కె.వి విద్యుత్ ఉపకేంద్రం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లూ భట్టి విక్రమార్క శంకుస్థాపన చేసి ప్రసంగించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి స్థానిక ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షత వహించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్‌తో కలిసి జిల్లా పోడు భూముల అంశంపై సమీక్ష నిర్వహించారు.

తరువాత ఇల్లెందు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, “రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఆర్థికంగా ఎదగడానికి సహాయపడే ఉద్దేశంతో ‘రాజీవ్ యువ వికాసం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకానికి బ్యాంక్ సీబిల్ స్కోర్‌తో ఎలాంటి సంబంధం లేదు. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుంది. స్కోర్ లేనందుకు ఎవరూ కలత చెందాల్సిన అవసరం లేదు,” అని స్పష్టం చేశారు.

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు ఈ పథకం కింద మంజూరైన సహాయాన్ని అందజేస్తామని ఆయన వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….