ప్రతి క్షణం
ప్రజల పక్షం

  చర్కాపై నూలు వడికిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

చర్కాపై నూలు వడికిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో భాగంగా శనివారం నిర్వహించిన ఎగ్జిబిషన్‌కు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గాంధీ చర్కాను తిప్పుతూ నూలు వడకడం ద్వారా మంత్రి ప్రజల్లో ఆత్మనిర్భరత, స్వదేశీ ఉద్యమాల ప్రాముఖ్యతను జ్ఞప్తి చేశారు. చర్కా ఉపయోగం ద్వారా స్వయం ఉపాధికి మార్గం చూపిన మహాత్మా గాంధీ సిద్ధాంతాలను గుర్తుచేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “స్వదేశీ ఉత్పత్తులు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ప్రతి ఒక్కరూ స్వదేశీని ప్రోత్సహించాలి” అన్నారు.
భారత్ సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌లో ఖాదీ వస్త్రాలు, స్వదేశీ ఉత్పత్తులు, చారిత్రక ప్రదర్శనలతో సందర్శకులను ఆకట్టుకున్నాయి. దేశీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై, గాంధీ సిద్ధాంతాలను ఆసక్తిగా పరిశీలించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!