మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.
కరకగూడెం నవంబర్ 29 ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని తాటిగూడెం పంచాయితీ విప్ప చెట్టు గుంపు గ్రామానికి చెందిన జిమ్మిడి నర్సమ్మ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ వారి నివాసానికి వెళ్లి నరసమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి దశదినకర్మలకు 25 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం కన్నయ్య , రామనాథం,దుర్గం ప్రవీణ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 87









