ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఈనెల 27న రాళ్ల వాగు వద్ద నేతకాని జన జాగృతి సభ.

కరకగూడెం,నవంబర్ 23 ఆధాబ్ న్యూస్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం మండలం రాళ్లవాగు వద్ద ఈనెల 27న తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి ఈశ్వర్ ఆదేశాల ప్రకారం  రాష్ట్ర నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జి  జాడి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో  నేతకాని తెలంగాణ సంక్షేమ సంఘం జన జాగృతి సభ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సమావేశానికి నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం మారుతి నేత , హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైగా నరేష్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జాడి వినీష్, కోశాధికారి జాడి రాజు, రాష్ట్ర నాయకులు దుర్గం మోహన్, జాడి నరేంద్ర, జగిత్యాల జిల్లా ఇంచార్జీ దుర్గం అశోక్ కుమార్, ములుగు జిల్లా ఇన్చార్జి జనగాం దుర్గారావు, భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి భగుతు శశి కుమార్, అలాగే అన్ని జిల్లాల ఇంచార్జీ లు, రాష్ట్ర నాయకులు, మేధావులు
కళాకారులు, శిక్షణ తరగతి మేథావి వర్గం వాళ్ళు హాజరవుతున్నారు. కావునా భద్రాద్రి, ములుగు, మహబూబాద్ జిల్లాలోని నేతకాని కులస్తులందరు నేతకాని జన జాగృతి సభ కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల పెద్దలందరూ, కులస్తులందరూ సంఘాలకు, పార్టీలకు అతీతంగా రావాలని ఆయన కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్