ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అక్రమంగా పశువుల రవాణా.. ముగ్గురిపై కేసు నమోదు. 

అక్రమంగా పశువుల రవాణా.. ముగ్గురిపై కేసు నమోదు.   అశ్వాపురం,ఆధాబ్ న్యూస్:

అశ్వాపురం మండలంలోని పాములపల్లి గ్రామం నుండి అక్రమంగా మూడు పశువులను పాల్వంచకు తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. పోలీసుల తనిఖీల సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించి పాల్వంచ రూరల్ పాండురంగాపురానికి చెందిన కుర్ర హనుమాన్, బానోతు సురేష్, భూక్య సాగర్ అనే ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమంగా తరలిస్తున్న మూడు పశువులను స్వాధీనం చేసుకుని సంరక్షణ నిమిత్తం గోశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, పశువులను రవాణా చేసే సమయంలో తప్పనిసరిగా సంబంధిత అనుమతి పత్రాలు, రవాణా పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. అక్రమ పశువుల రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్