సారపాక తాళ్లగొమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
భద్రాచలం మే 23 (ఆధాబ్ న్యూస్):
మణుగూరు నుండి భద్రాచలం వైపు వెళ్తున్న ఓ ఆటో సారపాక తాళ్లగొమ్మూరు సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంలో గాయపడిన వారు కరకగూడెం మండలానికి చెందిన ఆడెపు సతీష్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇప్పటికే గత సంవత్సరం ట్రాక్టర్ టైరుకు గాలి పెడుతున్న సమయంలో టైరు పేలి ఆడెపు సతీష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో చావుబతుకుల మధ్య బయటపడ్డాడు. అలాంటి ప్రమాదం నుండి కోలుకున్న సతీష్ కుటుంబానికి మళ్లీ ఇలాంటి విషాద ఘటన జరగడం స్థానికులను కలచివేసింది.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









