ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అందజేత – ఘనంగా సన్మానం

పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అందజేత – ఘనంగా సన్మానం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కొనసాగుతున్న 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో గ్రామంలో పరిశుభ్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న గ్రామపంచాయితీ పారిశుధ్య కార్మికులను గౌరవిస్తూ వారికి పీపీఈ (PPE) కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా కార్మికుల సేవలను గుర్తిస్తూ వారిని ఘనంగా సన్మానించారు.

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎల్లబోయిన ముత్తమ్మ తెలిపారు. వారి ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని పీపీఈ కిట్లను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇర్ప కుశేలుడు, గుడ్ల రంజిత్, పంచాయతి కార్యదర్శి జిమ్మిడి విజయ్, మాజీ జెడ్పిటిసి కొమరం కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ పారిశుధ్య కార్మికులు తమకు గుర్తింపు ఇచ్చి గౌరవించినందుకు గ్రామపంచాయితీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!