ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  చట్నీ వివాదం.. ప్రాణం తీసిన క్రూరత్వం

చట్నీ వివాదం.. ప్రాణం తీసిన క్రూరత్వం

హైదరాబాద్‌,ఆధాబ్ న్యూస్:
అనుకోకుండా చట్నీ పడిందనే చిన్న సంఘటన ప్రాణాంతక దాడికి దారి తీసింది. నాచారం–ఎల్బీనగర్ ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలో మురళీకృష్ణ (45) అనే వ్యక్తిని నాలుగు యువకులు (ఒక మైనర్‌ సహా) దారుణంగా హతమార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

మూలాలకు సమాచారం ఇలా ఉంది:

అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎల్బీనగర్ సమీపంలో లిఫ్ట్ కోరిన మురళీకృష్ణను కారులో తీసుకెళ్లిన యువకులు–

మహమ్మద్ జునైద్ (18)

షేక్ సైఫుద్దీన్ (18)

మణికంఠ (21)

ఒక మైనర్ బాలుడు (16)

కారులో ఎన్జీఆర్ఐ ప్రాంతంలో అందరూ కలిసి టిఫిన్ చేస్తుండగా, మురళీకృష్ణ పొరపాటున ఒక యువకుడిపై చట్నీ పడింది. దీనికి అతను క్షమాపణ చెప్పినా, యువకులు ఆగ్రహించి అతణ్ని బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు.

ఇంకా రెండు గంటల పాటు కారులో తిప్పుతూ, దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం కత్తితో దాడి జరగగా, తప్పించుకునేందుకు కారు నుంచి దూకి పరారయ్యే ప్రయత్నం చేసిన మురళీకృష్ణను యువకులు వెంబడించి చంపేశారు. మరణం నిర్ధారించుకున్న తర్వాత కత్తిని మార్గమధ్యలో పడేసి, కారు పార్క్ చేసి అక్కడి నుంచి పారిపోయారు.

ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….