ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని యువకుడు మృతి నెలరోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా విషాదం

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని యువకుడు మృతి
నెలరోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా విషాదం

గ్రేటర్ నోయిడా, ఆధాబ్ న్యూస్:
రైల్వే పట్టాలు దాటే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే — తుషార్ అనే యువకుడు బోడాకి రైల్వే క్రాసింగ్ వద్ద బైక్‌పై వేగంగా వెళ్తూ రైలు రాకముందే పట్టాలు దాటాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో బైక్ జారి కిందపడ్డాడు. అదే సమయంలో రైలు వేగంగా దూసుకొచ్చింది. కంగారుపడి పక్కకు తప్పుకోకుండా ముందుకు కదిలిన తుషార్‌ను రైలు ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. నెలరోజుల్లో తుషార్ వివాహం జరగాల్సి ఉండగా, ఈ అనర్థం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్