ప్రతి క్షణం
ప్రజల పక్షం

  బావిలో పడిన ఇద్దరు చిన్నారుల మృతి – విషాదంలో ఎంచగూడెం గ్రామం

బావిలో పడిన ఇద్దరు చిన్నారుల మృతి – విషాదంలో ఎంచగూడెం గ్రామం
మహబూబాబాద్,ఆధాబ్ న్యూస్:
మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో దసరా పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. పండగ సందర్భంగా తాతయ్య, అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు అనుకోకుండా వ్యవసాయ బావిలో పడిపోయిన ఘటన గ్రామాన్ని షాక్‌కు గురి చేసింది.

బావి వద్ద చిన్నారుల బట్టలు కనిపించడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేసి బావిలో వెతికారు. అనంతరం ఒక చిన్నారి మృతదేహం బయటపడగా, మరో చిన్నారి కోసం శోధన కొనసాగుతోంది.

తాత సారయ్య చెల్లెలు మృతిచెందడంతో కుటుంబం అంతా గ్రామానికి వచ్చినట్లు సమాచారం. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న  ఎస్సై రాజ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్