ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఏసీబీ దాడులు – లంచం తీసుకుంటుండగా మహిళా ఉద్యోగి అరెస్ట్

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఏసీబీ దాడులు – లంచం తీసుకుంటుండగా మహిళా ఉద్యోగి అరెస్ట్
వికారాబాద్,ఆధాబ్ న్యూస్:
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. రెవిన్యూ సెక్షన్లో పనిచేస్తున్న సుజాత అనే మహిళా ఉద్యోగిని, లంచం తీసుకుంటుండగా రంగేహస్తంగా పట్టుకున్నారు.

నవాబుపేట మండలం తహసీల్దార్ కార్యాలయానికి ప్రొసీడింగ్ కాపీ పంపించడానికి ₹15,000 లంచం డిమాండ్ చేసిన సుజాత, ఈ మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు.

ఈ విషయాన్ని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు వివరించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్