ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సంగారెడ్డి జిల్లా పాశమైలారం లో భారీ అగ్ని ప్రమాదం – 10 మంది కార్మికుల మృతి

సంగారెడ్డి జిల్లా పాశమైలారం లో భారీ అగ్ని ప్రమాదం – 10 మంది కార్మికుల మృతి
సంగారెడ్డి, ఆధాబ్ న్యూస్:
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పరిశ్రమల ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న సిగాచి అనే రసాయన పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.
పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే, కొంతమంది కార్మికులు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుడు తర్వాత పరిశ్రమ అంతటా మంటలు విస్తరించాయి. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు.

ప్రారంభిక సమాచారం ప్రకారం 10 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు. పరిశ్రమలో ఇంకా కొంతమంది కార్మికులు ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ప్రమాదానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు పూర్తి సమాచారం త్వరలో వెల్లడించనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్