ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వివాహిత ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన అమానుష ఘటన

వివాహిత ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన అమానుష ఘటన

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఘటన – ఆస్తి కోసం పథకం, హత్య, అరెస్టులు

జోగుళాంబ గద్వాల, ఆధాబ్ న్యూస్:
మానవత్వం మసకబారిన మానవ సంబంధాల ఘోర పరిణామం ఇది. పెళ్లయిన నెల రోజుల్లోనే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. బాధితుడు తేజేశ్వర్ (32) ప్రైవేటు సర్వేయర్‌గా పని చేస్తుండగా, అతను కర్నూలుకు చెందిన ఐశ్వర్యను మే 18న వివాహం చేసుకున్నాడు.

పెళ్లికి ముందు తప్పిపోయిన వధువు:
ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమవగా, ఐశ్వర్య పెళ్లికి ఐదు రోజులు ముందు అదృశ్యమవగా, తర్వాత తిరిగి వచ్చి నాటకమాడింది. తేజేశ్వర్‌ను నమ్మించి చివరికి పెళ్లి కూడా చేసుకుంది.

వివాహం తరువాత ఫోన్లో ప్రియుడితో 2000 కాల్స్:
వివాహం జరిగిన తర్వాత కూడా ఐశ్వర్య ప్రవర్తనలో మార్పు లేకుండా, తన ప్రియుడితో పదే పదే ఫోన్లో మాట్లాడుతుండడంతో తేజేశ్వర్‌కి అనుమానాలు మొదలయ్యాయి. దంపతుల మధ్య మనస్పర్థలు పెరిగాయి.

హత్యకు పథకం – ఆస్తి కోసం కుట్ర:
పోలీసుల దర్యాప్తులో భర్తను హత్య చేయాలన్న కుట్ర బయటపడింది. ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, మరియు ఓ బ్యాంకు ఉద్యోగి కలిసి తేజేశ్వర్‌ను హత్య చేయించేందుకు పథకం వేసినట్లు తేలింది. 2000కిపైగా ఫోన్లు మాట్లాడిన ఆధారాలు పోలీసులకు లభించాయి. తేజేశ్వర్‌ను సర్వే పేరుతో కారు ఎక్కించి తీసుకెళ్లి, కారులోనే గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలో పారవేశారు.

అరెస్టులు, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు:
ప్రస్తుతం ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు అరెస్టు చేయగా, బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు కొనసాగుతోంది.
సామాజిక సందేశం:
ఈ ఘటన యువతకు, సమాజానికి ఒక గంభీర హెచ్చరిక. నైతికత, బాధ్యత లేకుండా చేసిన చర్యలు ఎలా ప్రాణాలు తీస్తాయో ఈ ఘటన చూపిస్తుంది. ప్రేమ పేరుతో, ఆస్తి కోసం చేయబడే అమానుష చర్యలు శిక్షార్హమే కాదు, భవిష్యత్‌ తరాలకు దారుణమైన ఉదాహరణలు కావు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్